గ్రూప్ 1 పరీక్ష…ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

5
- Advertisement -

ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ఆర్టీసీ సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో May I Help You కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు.

Also Read:మైత్రీ మూవీ మేకర్స్… ‘8 వసంతాలు’

- Advertisement -