టీజీ టెట్ -2024 ఫలితాలు రిలీజ్

6
- Advertisement -

టి.జి.టెట్-2024 ఫలితాలు విడుదల విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టి.జి. టెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 51,443 అభ్యర్థులు.

పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించగా పేపర్-2లో 34.18% మంది అర్హత సాధించారు.https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది.

టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని అంగీకరించలేదు ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది ప్రభుత్వం. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

Also Read:టీ20 వరల్డ్ కప్..ఆసీస్ సరికొత్త చరిత్ర!

- Advertisement -