ఉక్కపోత..40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

13
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు ఇప్పుడిప్పుడే మండి పోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెల కాక ముందే ఎండలు మండి పోతుండడంతో మార్చి నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌ హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు, సరూర్‌ నగర్, చందా నగర్‌లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్‌లో 37.3 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్‌లో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:టీడీపీ జనసేన వస్తే.. అవన్నీ రద్దు?

- Advertisement -