‘తెలుసు కదా’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

3
- Advertisement -

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.

ఈ సినిమా పనులు శరవేగంగాజరుగుతున్నాయి, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అవుట్‌పుట్‌తో టీమ్‌ హ్యాపీగా ఉంది. నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి.

హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే!

- Advertisement -