ప్రముఖ టీవీ యాంకర్ మొహమ్మద్ కయిమ్ (లోబో) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం జనగాం జిల్లా రఘురాధపల్లి మండలం నిడిగొండ లో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారులో స్వంతంగా నడుపుకుంటూ వస్తున్న లోబో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. లోబో తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యాంకర్ లోబోతో పాటు ఆటోలో ఉన్న ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తన్న వారిలో ఒకరిద్దరి పరిస్ధతి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
లోబో నడుపుతున్న కారు అదుపుతప్పడంతోనే ఈప్రమాదం జరిగి ఉంటుందంటున్నారు పోలీసులు. లోబో ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు.. ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఇక ఈఘటనపై కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేపట్టార పోలీసులు. ప్రస్తుతం యాంకర్ లోబో పరిస్ధితి కుదురుగానే ఉందన్నారు వైద్యులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఒక లోబో ఓ ఛానల్ లో యంకరింగ్ చేయడమే కాకుండా కొన్ని కామెడీ షోలలో నటుడిగా చేస్తున్నాడు.