గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి శృతి..

274
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఆర్టిస్ట్ శృతి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ శృతి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిస్ట్ రవి వర్మ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండ పుప్పాల గూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ శృతి. అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్‌లు ప్రీతి నీగమా, హరిత జకీతోట, నీరజ )లు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

Shruthi
- Advertisement -