చర్చించుకుందాం రండి..తెలుగు సీఎంల భేటీ!

9
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలతో పాటు ఉద్యోగుల విభజన, పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు…సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ భేటీలో చాలా కాలంగా రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరస్పర సహకారం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందని చంద్రబాబుపేర్కొన్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో ముఖాముఖి సమావేశమై చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యం, పరస్పర సహకారం ఉంటేనే ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరి అభివృద్ధి సాధించగలుగుతామని వెల్లడించారు.

Also Read:సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం:ఐఎండీ

- Advertisement -