డ్రగ్స్ దందాలో తెలుగు నటీమణులు

30
- Advertisement -

టాలీవుడ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కేపీ చౌదరితో డ్రగ్ డీల్స్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో కొందరు తెలుగు నటీమణులు ఉండటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. దాంతో బొక్కలో దాక్కున్న ఎలుకల్లా ఆ నటీమణులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి.. ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదు అని వివరణ ఇస్తున్నారు. నటి సురేఖావాణి కూడా తన పై వస్తున్న ఈ డ్రగ్స్ ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చింది. పైగా ఈ ఆరోపణల వల్ల తన పిల్లల భవిష్యత్తు, ఫ్యామిలీ పరువు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ సురేఖావాణి సింపతీ రావడం లేదు. పైగా ఆమె పై నెటిజన్లు కూడా విరుచుకు పడుతున్నారు.

అందుకు ఒక కారణం ఉంది. గతంలో సురేఖావాణి కేపీ చౌదరితో చాలా సన్నిహితంగా మెలిగింది. నిజాలు తెలుసుకోకుండా రూమర్లు స్ప్రెడ్ చెయ్యొద్దని సురేఖావాణి కోరుతుంది. మరి దర్యాప్తులో చౌదరి కాల్ లిస్ట్, వాట్సప్ లో అషురెడ్డి, నటి సురేఖావాణి, జ్యోతి ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు కదా. మరి వాటి పై సురేఖావాణి ఏం మాట్లాడుతుంది. తన భర్త చనిపోయాక సురేఖావాణి విచ్చలవిడిగా తయారు అయింది అని అంటుంటారు. మరి ఈ క్రమంలోనే ఆమె తప్పు చేసిందా ? నిజం పోలీస్ లే తేల్చాలి.

Also Read: హ్యాపీ బర్త్ డే..ఉదయ్ కిరణ్

మరోవైపు కేపీ చౌదరితో డ్రగ్ డీల్స్ వ్యవహారంపై సినీ నటి జ్యోతి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “డ్రగ్స్ కేసులో నా ప్రమేయం లేదు. కేపీ నాకు ఫ్రెండ్ మాత్రమే. ఎలాంటి డ్రగ్ డీలింగ్స్ లేవు. అలాగే, ఆయన ఏర్పాటు చేసిన డ్రగ్ పార్టీలకూ నేను అటెండ్ కాలేదు. విచారణకు పిలిస్తే కచ్ఛితంగా వస్తా. ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగానే ఉన్నా” అని స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసుపై నటి ఆషురెడ్డి ఇలాగే స్పందించింది. మరి ఎవరూ తప్పు చేయకుండా.. అసలు తప్పు ఎలా జరిగిందో !!

Also Read: ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!

- Advertisement -