తెలంగాణ వ్యాక్సినేషన్ @ 3 కోట్లు

103
dmho
- Advertisement -

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య రెండు రోజుల్లో 3 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు. 75 శాతం మందికి మొదటి డోస్..39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడించారు. 50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందన్నారు. 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ప్రస్తుతం కోవిడ్ అదుపులోనే ఉందన్నారు.

వాక్సిన్ వల్ల కరోనా నుంచి 99 శాతం రక్షణ లభిస్తుందని…రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల 35 వేల మంది ఉన్నారని వెల్లడించారు. రెండో డోస్ ను లైట్ తీసుకోవద్దు…రష్యా, యూకే ల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు. వాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుందన్నారు. ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుందన్నారు. ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదని వెల్లడించారు.

- Advertisement -