చికిత్స కంటే నివారణే ముఖ్యం : ఈటల

577
etela rajender
- Advertisement -

చికిత్స కంటే నివారణ ముఖ్యం అనేది తెలంగాణ ప్రభుత్వ విధానం అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం పాడవుతుందన్నారు. సమాజం పోకడ మారింది ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న మైక్రో కుటుంబాలు గా మారిపోయాయని తెలిపారు.

ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకపోవడంతోనే సమాజంలో ఇలాంటి రుగ్మతలు చూస్తున్నాం. పిల్లల్లో అరాచక భావాలు రాకుండా ఇంట్లో ఉన్న పెద్దవారు చెప్పేవారు.సమాజంలో ఎలా మసలుకోవాలి, పెద్ద వారిని ఎలా గౌరవించాలి, ఆత్మీయులను ఎలా ప్రేమించాలి అని చెప్పేవారని చెప్పారు.కానీ ఇప్పుడు మంచి విషయాలు చెప్పే పెద్ద వారు కుటుంబంలో లేకపోవడం తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో పిల్లల్లో అనేక చెడు అలవాట్లను చూస్తున్నామని వెల్లడించారు.

చిన్నపిల్లల నేరాలకు ఘోరాలకు పాల్పడటం కనిపిస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం కుటుంబం నుంచే రావాలి అప్పుడే సమాజం బాగుంటుంది.ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన అల్జీమర్స్ అవగాహన వాక్ నీ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు.మతిమరుపు జబ్బుకి చికిత్స లేదు సహకారం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు.. కానీ మతిమరుపు వచ్చిన పెద్దలను అంటిపెట్టుకుని ఉండి వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే మతిమరుపు నుంచి దూరమవుతారు లేదంటే ఒంటరితనం ఆ జబ్బు ను మరింత ఎక్కువ చేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఈ వ్యాధికి కూడా చికిత్స వస్తే వాటిని ప్రభుత్వపరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాము .అవగాహన కల్పించేందుకు రెడ్ క్రాస్ వాళ్లు ప్రభుత్వ హాస్పిటల్ లో సెంటర్లో అడుగుతున్నారు.. అటువంటి వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.చాలా జబ్బులు అవగాహనతోనే దూరమవుతాయి.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లాగ్ ఆఫ్ చేసి వాక్ నీ ప్రారంభించారు.

- Advertisement -