యుఎస్‌లో తెలంగాణ విద్యార్థి గల్లంతు…

360
us student sravan
- Advertisement -

అమెరికాలోని బోస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణకు చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఓ ప్రముఖ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఆదివారం ఈస్టర్ పండగను పురస్కరించుకొని స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లాడు. సరదాగా స్నేహితులతో కలిసి సముద్రంలోకి దిగిన శ్రవణ్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి పోయాడు. శ్రవణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారుప

శ్రవణ్‌ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. శ్రవణ్ కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -