లండన్ నుండి సతీష్ మృతదేహం తరలింపు

261
sathish
- Advertisement -

ఐనవోలు మండలం రాంనగర్ గ్రామానికి చెందిన కాగితపు సతీష్ కుమార్ యాదవ్  ఇటీవల లండన్ లో గుండె పోటుతో మరణించ సంగతి తెలిసిందే.

స్థానిక వర్ధన్నపేట, నందనం గ్రామం కి చెందిన గజ్జెల్లి రాజు మరియు వర్ధన్నపేట ఎమ్మల్యే ఆరూరి రమేష్ గారి అబ్బాయి విశాల్ ఆరూరి, సతీష్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకునేలా అక్కడికి అధికారులతో మాట్లాడి కృషి చేశారు.

అలాగే స్థానిక ప్రవాస భారతీయ, తెలుగు, తెలంగాణ మరియు ఎన్నారై తెరాస లండన్ సంస్థలు వారి ప్రతినిథులు అనిల్ కూర్మాచలం, కిరణ్ పసునూరి,  అశోక్ గౌడ్, గంప వేణు, సుమన్ బలమూరి, పింగిళి శ్రీనివాస్ రెడ్డి మరియు కిషోర్ మునుగాల కలిసి సుమారు £16500 పౌండ్స్  ( పదహారు లక్షల రూపాయలు )  సేకరించి సతీష్ భౌతికకాయం స్వగ్రామానికి పంపడానికి సహాయం చేసినట్టు జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు కుమారుడు రాజు తెలిపారు.

ఎమ్మల్యే ఆరూరి రమేష్ గారి సహకారం మరువలేనిది అని మరియు ఈ పరిస్థిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారని సతీష్ సోదరుడు రంజిత్ తెలిపారు.

- Advertisement -