అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి..

458
- Advertisement -

అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలానికి చెందిన బూర్ల అరుణ్‌ కుమార్‌(41) బూర్ల చంద్రశేఖర్‌ – పద్మ దంపతుల కుమారుడు అరుణ్‌ కుమార్‌. ఈయన హ్యుస్టన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

Arun Kumar

అరుణ్‌ కుమార్‌ 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్‌ కుమార్‌.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అరుణ్‌ మృతితో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -