- Advertisement -
తెలంగాణ రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.6098 కోట్ల నిధులను జమ చేశారు. రుణమాఫీ నిధుల అనంతరం సచివాలయంలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు సీఎం రేవంత్. రుణమాఫీ నిధులతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని..కాంగ్రెస్ మాట ఇస్తే శిలాసానమని చెప్పారు రేవంత్. త్వరలోనే వరంగల్లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.
తెలంగాణలో ఇది పండగరోజని….తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈరోజును మర్చిపోలేనని చెప్పారు రేవంత్. ఈ నెలాఖరు లోపు లక్షన్నర రుణమాఫీ కానుండగా ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణమాఫీ జరగనుంది.
Also Read:సింగరేణి కార్మికుల రాజ్ భవన్ ముట్టడి
- Advertisement -