రాష్ట్రంలో కొత్తగా 6,876 మందికి కరోనా..

113
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గింది. వైద్యారోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 70,961 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,876 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 7,432 మంది కరోనా నుంచి కోలుకోగా, 59 మంది మరణించారు. దాంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 2,476కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,63,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,81,365 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,029 కొత్త కేసులు నమోదయ్యాయి.

- Advertisement -