రాష్ట్రంలో కొత్తగా 197 కరోనా కేసులు నమోదు..

122
covid 19
- Advertisement -

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, 376 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,88,275 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,589కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,389 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1842 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య వెల్లడించింది.

- Advertisement -