రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా 477 కేసులు..

74
corona cases
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 25,989 శాంపిల్స్ పరీక్షించగా, 477 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,99,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,91,461 మంది కోలుకున్నారు.

ఇంకా 3,960 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు. ఇక కొత్తగా నమోదైన కేసులలో హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 258 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -