తెలంగాణలో ఒక్కరోజే 269 కేసులు..

260
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 269 కేసులు నమోదుకాగా ఇందులో హైదరాబాద్ పరిధిలోనే 214 ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బన్‌ 10, కరీంనగర్‌ 8, జనగామ, ములుగు 5 చొప్పున, మెదక్‌, సంగారెడ్డి 3 చొప్పున, వనపర్తి, మేడ్చల్‌ 2 చొప్పున, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,675 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 192 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారిలో 81శాతం మంది బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉండటం గమనార్హం.

- Advertisement -