తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 3,308 కేసులు..

134
- Advertisement -

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 3,308 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 4,723 మంది కరోనా నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 513 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 16 కేసులు గుర్తించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,51,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,04,970 మందికి కరోనా నయం అయింది. ఇంకా 42,959 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,106కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.56 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 1.1 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు తెలంగాణలో 91.64 శాతానికి పెరగ్గా, జాతీయస్థాయిలో అది 87.7 శాతంగా ఉంది.

- Advertisement -