రాష్ట్రంలో కొత్తగా 10,122 కరోనా కేసలు..

147
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,122 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది.

ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1440 కేసులు ఉన్నాయి.

- Advertisement -