ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?

36
- Advertisement -

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలూ ఉండవని భావిస్తున్నారు సీఎం రేవంత్. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.

గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. గత రిజర్వేషన్లతోనే ఈసారి కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:KTR: ఆగస్టు 2 డెడ్ లైన్, ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన కేటీఆర్

- Advertisement -