ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

136
mlc
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం – వరంగల్‌-నల్గొండ, మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి -హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్‌ జరుగనుంది.

నోటిఫికేషన్‌ విడుదల : ఫిబ్రవరి 16 (మంగళవారం)

నామినేషన్లకు చివరితేదీ : ఫిబ్రవరి 23 (మంగళవారం)

నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 (బుధవారం)

నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ : ఫిబ్రవరి 26 (శుక్రవారం)

పోలింగ్‌: మార్చి 14 (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు

ఓట్ల లెక్కింపు : మార్చి 17 (బుధవారం)

- Advertisement -