మేడారం జాతర పనులను పరిశీలించిన మంత్రులు..

492
medaram
- Advertisement -

నేడు మేడారం మహాజాతరలో జరుగుతున్న పనులను పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,అల్లోల ఇంద్రకరన్ రెడ్డి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్ నుండి మేడారం చేరుకున్న మంత్రులు అనంతరం జాతరలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షాసమావేశంలో పాల్గొననున్నారు.

medaram

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్నానఘట్టాలను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వనప్రవేశంతో ముగియనుంది.

ministers

- Advertisement -