ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ…

262
ktr
- Advertisement -

నేడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీలో పర్యటన నేపథ్యంలో 12 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కేటీఆర్‌ భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల పరిశ్రమలశాఖల మంత్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ సాయంత్రం 5.30గంటలకు గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. తరువాత 7.30 గంటలకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ కానున్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -