ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌పై మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్ష‌

28
harish
- Advertisement -

తెలంగాణ ఉద్యోగ జాతరలో భాగంగా త్వరల్లో గ్రూప్‌3, 4 ఇంజినీర్ల నియామకాలు చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌పై హ‌రీశ్‌రావు స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, వివిధ నియామ‌క సంస్థ‌ల అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నోటిఫికేష‌న్ల జారీలో వేగం పెంచాల‌ని సూచించారు. గ్రూప్ -3, 4, ఇంజినీర్ల నియామ‌కాల నోటిఫికేష‌న్లు త్వ‌ర‌గా ఇవ్వాల‌ని చెప్పారు. ఇప్ప‌టికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌తో పాటు ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -