రాష్ట్రంలో కొత్తగా 987 కరోనా కేసులు నమోదు..

111
Covid
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా 987పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,362 మంది బాధితులు చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,22,593కు పెరిగాయి. 6,05,455 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 13,487 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3651కి చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -