హైకోర్టుకు సీజే చంద్రచూడ్ భూమిపూజ

15
- Advertisement -

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ వద్ద బుద్వేల్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ భూమిలో ఇవాళ నూతన హైకోర్టు భవనాల నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ భూమిపూజ చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం జరగనుంది.

ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రజాప్రతినిధులు హాజరు కావటం లేదని తెలిసింది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరగనుంది.

Also Read:శర్వానంద్..’మనమే’ ఫస్ట్ సింగిల్

- Advertisement -