మూడు రోజులు మండే ఎండలే..

13
- Advertisement -

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమాకొండ,, జయశంకర్ భూపాలపల్లి,జోగులాంబ గద్వాల్,ఖమ్మం, మహబూబ్ బాద్, మహుబూబ్ నగర్ ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ్ పెట్ సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాలో రానున్న 3 రోజులు ఉష్ణుగ్రతలు 41నుండి 44 డిగ్రీల వరకు గరిష్ట స్థాయాలో నమోదు అవుతాయని వెల్లడించింది.

మిగతా జిల్లాలో 36నుంచి 40 డిగ్రీ ల వరకు ఉష్ణుగ్రతలు నమోదు అవుతాయని… వడగాల్పులు తీవ్రత అధికంగా ఉంటుంది తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.

Also Read:కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత!

- Advertisement -