బోనాల జాతరకు ముందే ప్రభుత్వ ఆర్థిక సహాయం : మంత్రి తలసాని

68
talasani
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. బోనాల జాతరకు ముందే ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తెలపారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 3,500 కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఈ నెల 17 న బోనాల జాతర ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. 24న హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు, 18 వ తేదీన చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని సూచించారు.

- Advertisement -