తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు- సీఎం

155
kcr meeting
- Advertisement -

బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సీఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామల్లొ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.

- Advertisement -