కలెక్టర్లకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

621
cm kcr
- Advertisement -

అత్యవసర, అవసరమైన పనుల కోసం కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఒక్కో కలెక్టర్ కు కోటి రూపాయలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.33కోట్లు నిధులు విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులకు పలు అంశాలపై దిశానిర్డేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యం అయి ఉండాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -