- Advertisement -
హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది ప్రభుత్వం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్నిమతాలకు చెందిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -