తెలంగాణ దేశానికే ఆదర్శం: ఎంపీ నామా

175
mp nama
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని టీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల గురించి రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో చేపట్టే పథకాలు సైతం తెలంగాణ స్ఫూర్తినిస్తుంది నామా అన్నారు.కోవిడ్ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనిపై కూడా చర్చ జరపాలని మేము పార్లమెంటులో పెడతామని నామా పేర్కొన్నారు.

ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు నామా. కేంద్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు చాలా రావల్సినవి ఉన్నాయి. వాటి గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. రైతులకు కావలసినంత నీరు, ఉచితంగా విద్యను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతులు పండించిన పంటకు మెరుగైన గిట్టుబాటు ధర లభించాలి. సుబాబుల్, జామాయిల్ వంటి పంటల విషయం కూడా మా దృష్టికి వచ్చాయి. వీటి గురించి కూడా చర్చించాలని ఎంపీ నామా స్పష్టం చేశారు.

- Advertisement -