- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తెలంగాణ ప్రభుత్వం ఆచార్య చిత్రయూనిట్కి గుడ్ న్యూస్ అందించింది.
ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు… టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై రూ.50, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.30 వరకూ టికెట్ ధరలు పెంచుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో అనుష్క ఓ స్పెషల్ సాంగ్లో నటించారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -