కృష్ణా నదీ బోర్డుకు తెలంగాణ లేఖ..

254
Telangana Govt Complaint to Krishna River Water Board
- Advertisement -

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జీవోపై కృష్ణ నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టీఎంసీల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం 203 జీవో జారీ చేసింది. ఈ జీవోపై మా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.

ఏపీ శ్రీశైలం నుండి కొత్త లిఫ్ట్ స్కింను ఏర్పాటు చేయడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అడ్మినిస్ట్రేషన్ జీవో అక్రమం. కేఆర్ ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఏ ప్రాజెక్ట్ అయిన మొదలు పెట్టాలి. దీనిపై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ వెంటనే చర్యలు చేపట్టండి. టెండర్ల ప్రక్రియ నిలిపివేయండి అని రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -