ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూన్.. డీఏ ను పెంచిన సర్కార్

339
Telangana Secratariet
- Advertisement -

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ ఉత్తర్వూలు జారీ చేసింది . ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.

 

ప్రస్తుతం 2.234 గా ఉన్న డీఏ ను 3.144 కి పెంచారు. పెరిగిన జీతాలు జులై నెల నుంచి అమలు లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం డీఏను పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కు రుణ పడి ఉంటామని చెబుతున్నారు.

- Advertisement -