20ఏళ్లలో నేను చూసిన రెండవ సినిమా సైరాః గవర్నర్

581
Telangana-governor-Tamilisai-Soundararajan
- Advertisement -

గత 20ఏండ్లలో తాను చూసిన రెండవ సినిమా సైరా నరసింహారెడ్డి అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు నేడు సినిమాను చూశారు గవర్నర్ తమిళిసై. ఈసినిమా చూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈమూవీలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.

1999 సంవత్సరం నుంచి తాను సినిమాలు చూడలేదన్నారు. 2018లో రజనీకాంత్ నటించిన కాలా చిత్రం చూశానన్నారు. ఆ తర్వాత ఇవాళ సైరా సినిమాను వీక్షించినట్లు తెలిపారు. తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు.

కాగా సినిమా విడుదల తర్వాత చిరంజీవి రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సురెందర్ రెడ్డి ఈసినిమాకు దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నిర్మించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈమూవీకి భారీగా స్పందన వస్తోంది.

- Advertisement -