ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన గవర్నర్

347
Governer
- Advertisement -

వెటర్నరి వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. శంషాబాద్ లోని నక్షత్ర కాలనీలోని ప్రియాంకరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు గవర్నర్. మృతురాలి తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు.

Tamilisai

మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండాలనీ, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడదామని ఆమె వారికి ఈ సందర్భంగా తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ వారికి హామీ ఇచ్చారు. కాగా 4గురు నిందితులకు 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం వారిని భారీ బందోబస్తు నడుమ చెర్లపల్లి జైలుకు తరలించారు.

- Advertisement -