మంత్రి పిలుపు మేరకు మొక్కలు నాటిన గెజిటెడ్ ఆఫీసర్స్..

229
Gazetted officers
- Advertisement -

తెలంగాణ ఉద్యమనాయకులు, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అధ్యక్షులు యం.బి.క్రిష్ణయాదవ్, కార్యదర్శి హరికృష్ణ, ఉపాధ్యక్షులు మంచాల రవిందర్ లు మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో మంత్రి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సీతాఫలం చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేశారు. కాగా,మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆయన తన నివాసంలో మొక్కలు నాటి.. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా సందర్భం ఏదైనా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -