సీఎం కేసీఆర్‌ పిలుపుకు సై అంటున్న రైతులు..

448
harishrao
- Advertisement -

నియంత్రిత వ్యవసాయం పై సీఎం కేసీఆర్ పిలుపుకు సై అంటున్నారు సిద్ధిపేట జిల్లా రైతులు. జిల్లా వ్యాప్తంగా గజ్వెల్,సిద్ధిపేట నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు పలు గ్రామాలు.

గజ్వేల్ మండలం దాతర్ పల్లి ,నంగునూరు మండలం పాలమాకుల,JP తండా ,దర్గపల్లి, చిన్నకోడూరు మండలం కిష్టాపూర్, మెట్టుపల్లి,నారాయణ రావు పేట మండలం గోపులాపూర్, జక్కాపూర్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సూచన మేరకు నియంత్రిత పద్దతిలో పంటమార్పిడి విధానం లో సాగు చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు గ్రామస్థులు.దాతర్ పల్లి లో నియంత్రిత పద్దతిలో సాగు చేస్తామని తీర్మానం చేసి పత్రాన్ని మంత్రి హరీష్ రావుకు అందించారు గ్రామస్థులు,రైతులు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవపురంలో రైతు సమగ్ర విధానంలో భాగంగా రైతుల ఏకగ్రీవ తీర్మానం చేశారు.సిఎం కేసీఆర్ చెప్పినట్లుగా వానకాలం మొక్కజొన్న వేయమని తీర్మానం చేశారు.

- Advertisement -