మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు..

142
errabelli
- Advertisement -

ఎంతో కాలంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యల సాధనతో పాటు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఆయన క్యాంపు కార్యాలయం హన్మకొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం కలిశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొమోషన్స్ సీఎం కెసిఆర్ గారి ఆదేశాలతో దాదాపు అన్ని శాఖలలో ప్రొమోషన్స్ వచ్చిన సందర్బంగా గౌరవ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి ఉద్యోగ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు మెరుగైన PRC ఫిట్మెంట్ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించాలని మంత్రిని కోరారు. జిల్లాకు చెందిన ఉద్యోగుల వివిధ సమస్యలను మంత్రికి వివరించారు.

వాటిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో TGO, TNGO ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్స్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కోలా రాజేష్ కుమార్, TRESA జిల్లా అధ్యక్షులు G. రాజకుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు రియాజుద్దీన్ TGO, TNGO నాయకులు మాధవ రెడ్డి, సదానందం, మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -