ఎన్నికల ప్రచారం బంద్..మందుబాబులకు షాక్

40
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. 13 నియోజకవర్గాల్లో గంట ముందే ప్రచారం ముగియనుండగా ప్రచారం ముగియగానే స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు,రాజకీయ ప్రకటనలు చేయరాదని ఈసీ తెలిపింది.

119 నియోజకవర్గాలలో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు. వీరిలో పురుషు ఓటర్ల సంఖ్య 1,62,98,418 కాగా, మహిళలు ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు.
థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406, ఓవర్సీస్‌ ఓటర్లు 2,944 మంది ఉన్నారు. ఈనెల 30న ఎన్నికలు,వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బంది పాల్గొననుండగా 45 వేల మంది పోలీస్ లతో భారీ భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరా లతో నిఘాతో పాటు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ నుండి ఇప్పటివరకు దాదాపు 709 కోట్ల రూపాయలు సీజ్ చేయగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు వైన్స్ లు బంద్ కానున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ తో పటిష్ట భద్రత భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలు భద్రతను నిర్వహించనున్నాయి.

Also Read:ఇజ్రాయెల్‌-హమాస్‌…కాల్పుల విరమణ పొడగింపు

- Advertisement -