టీఎస్ ఎంసెట్ ఫలితాలు రిలీజ్..30 నుండి కౌన్సెలింగ్

227
ts
- Advertisement -

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్‌ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని వెల్లడించారు. సెప్టెంబర్‌ 15న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత వ్యవసాయ, ఫార్మా కోర్సుల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -