రాష్ట్రంలో 24 గంటల్లో 518 కరోనా కేసులు…

123
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో గత 24 గంటల్లో 518 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,309కు చేరగా 2,99,631 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3995 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటివరకు 1683 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.14శాతం, మరణాల రేటు 0.55శాతం ఉండగా కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 157, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 44, రంగారెడ్డిలో 38, నిజామాబాద్‌లో 29, సంగారెడ్డిలో 21, మహబూబ్‌నగర్‌లో 20, కరీంనగర్‌లో 18 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

- Advertisement -