రాష్ట్రంలో 24 గంటల్లో 1256 కరోనా కేసులు..

229
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1256 మందికి కరోనా పాజిటివ్ రాగా 10 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,24,840 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. 80,751 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 57,586 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు.

గత మూడు రోజులతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 389 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 637 మంది మృత్యువాతపడ్డారు.

శనివారం 22,925 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 6,13,231కి చేరుకున్నట్టు ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

- Advertisement -