50 వేలకి చేరువలో కరోనా కేసులు…

211
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1,554 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 9 మంది మృత్యువాతపడ్డారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 49,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 37,666 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 438 మంది మృతిచెందారు. గ‌త 24 గంట‌ల్లో 15,882 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటివరకు 3,08,959 శాంపిల్స్ టెస్ట్ చేశామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా పరిశీలిస్తే హైద‌రాబాద్‌లో 842 కేసులు న‌మోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 132, మెద‌క్‌లో 96, క‌రీంన‌గ‌ర్‌లో 73, న‌ల్గొండ‌లో 51, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 38, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 36 కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -