5 వేలు దాటిన కరోనా కేసులు…

231
coronavirus cases
- Advertisement -

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 5 వేలు దాటింది. గత 24 గంటల్లో 219 కేసులు నమోదుకాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 189 ఉన్నాయి. వైరస్‌ తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 5,193 కేసులు నమోదు కాగా 187 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. కరోనా పరీక్ష ఫీజు రూ.2200గా నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా లక్షణాలున్న వారికి ఉచితంగా టెస్టులు నిర్వహించనున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -