41 వేలు దాటిన కరోనా కేసులు…

155
coronavirus
- Advertisement -

తెలంగానలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 వేలు దాటాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 1,676 పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతిచెందారని తెలిపింది.

ఇందులో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 788 కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చ‌ల్‌లో 160, క‌రీంన‌గ‌ర్‌లో 92, న‌ల్గొ్ండ‌లో 64, సంగారెడ్డిలో 57, వ‌న‌ప‌ర్తిలో 51 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు 41,018కు చేరుకోగా 396 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,081 బెడ్స్ ఉండ‌గా.. ప్ర‌స్తుతం 1,692 మంది రోగులు ఆస్ప‌త్రుల్లో ఉన్నారు.. మ‌రో 15,389 బెడ్లు ఖాళీగా ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది.

- Advertisement -