తెలంగాణలో 37వేలు దాటిన కరోనా కేసులు…

213
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 వేలు దాటింది. మంగళవారం 1,524 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఒక్కరోజే 10 మంది మృత్యువాత పడ్డారు.ఇక తెలంగాణలో ఇప్పటివరకు 37,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 375 మంది మృత్యువాతపడ్డారు. కరోనా మహమ్మారి నుండి కొలుకోని 24,840 డిశ్చార్జ్ కాగా 12,531 చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,95,024 పరీక్షలుచేశారు. కొవిడ్‌ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 17,081 పడకలు ఉండగా, 1,805 మాత్రమే భర్తీ అయ్యాయని, 15,276 పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 815 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్‌ మల్కాజిగిరి 97, సంగారెడ్డి 61, నల్లగొండ 38, వరంగల్‌ అర్బన్‌ 30, కరీంనగర్‌ 29, మెదక్‌ 24, వికారాబాద్‌ 21, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 19, నిజామాబాద్‌ 17, సూర్యాపేట 15, జోగుళాంబగద్వాల 13, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి 12, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం 8, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ 7, ములుగు 6, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 5, సిద్దిపేట, జనగామ 4, నిర్మల్‌ 3, వరంగల్‌ రూరల్‌, జగిత్యాల 2, నాగర్‌కర్నూల్‌ 1 చొప్పున కేసులు నమోదయ్యా యి.

- Advertisement -