తెలంగాణలో 30వేలకు చేరువలో కరోనా కేసులు..

192
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. బుధవారం 6363 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1924 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇక ఇప్పటివరకు తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరగా ఇప్పటివరకు 324 మంది మృతిచెందారు. . ప్ర‌స్తుతం 11,933 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స 17,279 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 1590 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.

జిల్లాల వారిగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చ‌ల్‌లో 43, క‌రీంన‌గ‌ర్‌లో 14, సంగారెడ్డిలో 20, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 15, న‌ల్గొండ‌లో 31, నిజామాబాద్‌లో 19,వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 26, సిరిసిల్ల‌లో 13 కేసులు ఇలా అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయి.

- Advertisement -